ఐతం కళాశాలలో ప్రత్యేక అవగాహనలు,దేశంలో స్థిరమైన వ్యాపారాలు, సంస్థలు అమలు చేసి ఖచ్చితమైన అవగాహనతో పెట్టుబడులు పెట్టి, ప్రగతి సాధికారత సాధించేందుకు విద్యార్థులు సిద్ధం కావాలని ఐతం కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు తెలిపారు. ఐతం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల నైపుణ్యతను మార్కెట్ సెక్యూరిటీ అవగాహనను ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ జనరల్ మేనేజర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కె నాగభూషణ్ శిక్షణ ఇచ్చారు, మార్కెట్ నిర్మాణం, షేర్లు, బాండ్లు, రిస్క్, రక్షణ అంశాలపై వివరించారు, ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ చంద్ర శేఖర్, డాక్టర్ బలరాం, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
