సినీనటులు మాగంటి మురళీ మోహన్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సభ్యులు టి సాయికామరాజు, యు. విజయ్, భట్టిప్రోలు శ్రీనివాసరావు (బిఎస్ఆర్ ) నిర్మాత రాశి నరసింహారావు, పూడి శ్రీనివాస్, బి. బాలసుబ్రమణ్యం, టి. వీరప్రసాద్, బొండా రాంబాబు, కారుమూరి భాస్కరరావు, అన్నారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర – సాంకేతికం, వాణిజ్యం – పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం- విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 5 గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందించాయన్నారు. సుదీర్ఘ సినీ జీవితంలో చిరునవ్వుకు చిరునామా మురళీ మోహన్ అని, నిర్మాతగా అద్భుతమైన చిత్రాలు అందించారన్నారు. 50 ఏళ్లుగా సినీ రంగంలో అపజయం ఎరుగని వ్యక్తిగా నిలిచారని అభినందించారు.
