Home Politics Andhra Pradesh ఉబ్బెంగులకు నూతన రహదారి నిర్మాణం పనులు పూర్తి

ఉబ్బెంగులకు నూతన రహదారి నిర్మాణం పనులు పూర్తి

0

హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ త్రినాథ్, గ్రామస్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మారుమూల లక్ష్మీపురం పంచాయితీ ఉబ్బెంగుల గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. దీంతో సర్పంచ్ కె త్రినాధ్ తో పాటు ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పనులు పూర్తయిన నూతన రహదారిని సోమవారం సర్పంచ్ కొర్రా త్రినాథ్, స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బుంగాపుట్టు పిఆర్ రోడ్డు నుండి ఉబ్బెంగుల వరకు రెండు కిలో మీటర్లు రోడ్డు నిర్మాణం కు పీఎం జన్ మన్ పథకం కింద రూ. కోటి 94 లక్షలు మంజూరు అయిందని తెలిపారు. ఆ నిధులు వెచ్చించి నూతన రహదారి నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఆ ప్రాంతీయులకు రవాణా కష్టాలు గట్టెక్కాయని, దీంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రోడ్డు నిర్మాణం కోసం సహకరించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు,అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వారు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వి.సాధురాం,వార్డు సభ్యులు వి.గురుమూర్తి,వి.సుబ్బారావు,పిసా సభ్యులు వి.సుబ్బారావు, వి.నీలకంఠం,గ్రామస్థులు వి.మెట్ట,రంపాన,సోమనాథ్,సద్దు,తదితరులు పాల్గొన్నారు,

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version