Home Politics Andhra Pradesh జాతర కమిటీ సభ్యులను హెచ్చరిస్తున్న సీఐ మూర్తి

జాతర కమిటీ సభ్యులను హెచ్చరిస్తున్న సీఐ మూర్తి

0

గోకవరం మండలంలో జాతరలు, ఉత్సవాల పేరుతో సంప్రదాయాలకు విరుద్ధంగా అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని గోకవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మూర్తి గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం గోకవరం పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు.
మండలంలో త్వరలో ప్రారంభం కానున్న గ్రామదేవతల జాతరలు, తిరునాళ్ల నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ, “జాతరలు అంటే భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. ప్రజలందరూ కుటుంబసమేతంగా ఆనందంగా గడిపే వేడుకలు. పవిత్రమైన దేవాలయాల ప్రాంగణంలో, ఉత్సవాల వేదికలపై సంస్కృతి, సంప్రదాయాలకు తూట్లు పొడిచేలా అసభ్యకరమైన నృత్యాలు, జూదం వంటి కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోము” అని స్పష్టం చేశారు.
యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి కార్యక్రమాల వల్ల గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్సవ నిర్వాహకులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, కేవలం భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేస్తే, నిర్వాహకులపై, ప్రదర్శన ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే, ఉత్సవాల నిర్వహణకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని, అనుమతి తీసుకునే సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడబోమని హామీపత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని, జాతరలు ప్రశాంత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version