అధ్యాపకులకు విస్తృత అవగాహన సదస్సు కృత్రిమ మేధస్సు సాధనాలను బోధన ప్రక్రియలో పరిశోధనాత్మకంగా కార్యాచరణలో సమర్థవంతంగా వినియోగించుకొని విధానాలను కళాశాల అధ్యాపకులకు చక్కని అవగాహన కల్పించారని జాతీయ సాంకేతిక ఉపాధ్యాయుల శిక్షణ, పరిశోధనా సంస్థ ప్రతినిధులను ఐతం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ వి వి నాగేశ్వరరావు కొనియాడారు. సమగ్రమైన ఆలోచన విధానాలను నేర్చుకుని విద్యా వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయని ప్రయోజిత అభ్యాసానికి ఎంతగానో తోడ్పడి విద్యాసవాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధ్యాపకులు సిద్ధమవుతారని ఈ మేరకు ఎన్ ఐ టి టి ఆర్ ప్రతినిధి డాక్టర్ కే వెంకటరావును, డైరెక్టర్ నాగేశ్వరరావు ప్రశంసించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాసరావు, కన్వీనర్లు, డాక్టర్ పి శ్రీహరి, డాక్టర్ డి అజాద్ పాల్గొన్నారు.
