శివరాత్రికి ముందే పనులు పూర్తికి ఆదేశం,చోడవరం కొత్తకోటలో చేపట్టిన తారు రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కొత్తకోట మెయిన్ రోడ్డుతో ఆటో కళ్యాణపు లోవాకు కు వెళ్లేందుకు కూడా ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు బీఎన్ రోడ్డు పనులను పరిశీలించి శివరాత్రి నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి 15న శివరాత్రి ఉన్నందున, కళ్యాణపులోవకు వెళ్ళడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో, కాంట్రాక్టర్తో మాట్లాడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి నాయకులు పాల్గొన్నారు.
