రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ జన్మదినo సందర్భంగా బుధవారం మాడుగుల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేశారు. అలాగే మాడుగుల శ్రీ సాయిబాబా మందిరంలో పేదలకు అన్నదానం కార్యక్రమం, గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ కోలనిలో పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం ఎస్సీ సెల్ నేత మరువాడ ఈశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమoలో మాడుగుల టిడిపి టౌను అధ్యక్షులు పుప్పాల లక్ష్మీనారాయణ మాడుగుల కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కొట్నాల త్రినాధ రావు టౌన్ కార్యదర్శి వడ్డాది బాబు, కే నానాజీ , మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
