విశాఖ డైరీ పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనందబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాఖ డైరీ పార్లర్ స్థానిక నాయకులతో కలిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరీ ప్రారంభించినప్పటి నుండి రైతుల లను ఆదుకోవడానికి కృషి చేస్తుందన్నారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జన్మదిన సందర్భంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ గా గేదెల సత్యనారాయణ, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు ఏం వివి సత్యనారాయణ, గోకవాడ కోటేశ్వరరావు, వి య్యపు అప్పారావు, దేవర అప్పారావు ద్వారపూరెడ్డి అప్పలనాయుడు, ముమ్మిన సూర్యనారాయణ సేనాపతి మణికంఠ పలు గ్రామాల పాల సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.
