Monday, April 20, 2026
HomePoliticsAndhra Pradeshతిరుపతి లడ్డూ వివాదంపై చంద్రబాబుపై వేణుగోపాల్ ఫైర్… హెరిటేజ్‌పై ‘దైవ తీర్పు’ వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదంపై చంద్రబాబుపై వేణుగోపాల్ ఫైర్… హెరిటేజ్‌పై ‘దైవ తీర్పు’ వ్యాఖ్యలు

చెల్లుబోయిన వేణుగోపాల్ మరోసారి ఘాటుగా స్పందించారు. నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూ వ్యవహారంలో దేవుడితోనే రాజకీయాలు చేశారని ఆరోపిస్తూ, దాని ఫలితమే హెరిటేజ్ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలని వ్యాఖ్యానించారు. సోమవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన లడ్డూ ప్రసాదం అంశాన్ని రాజకీయ రంగంలోకి లాగడం దురదృష్టకరమన్నారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి పేరుతో వివాదాలు సృష్టించడం సమంజసం కాదని విమర్శించారు. భక్తుల విశ్వాసాలతో ఆటలాడినవారికి దైవ తీర్పు తప్పదని ఘాటుగా అన్నారు.
హెరిటేజ్ ఫుడ్స్ ఆర్థిక పరిస్థితులు యాదృచ్ఛికం కావని, ఇది దైవ నిర్ణయమేనని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ నాణ్యత, ప్రసాద పరిరక్షణ వంటి సున్నితమైన అంశాలపై రాజకీయ లాభం కోసం దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
భక్తి, ఆధ్యాత్మిక అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం వల్ల సమాజంలో విభేదాలు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. తిరుమల వంటి పవిత్రక్షేత్రాల ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపైనా ఉందన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం చివరకు చేటుకే దారి తీస్తుందని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments