77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా అవార్డులు ప్రధానం చేశారు. తొట్టంబేడు మండలంలో ప్రజా సేవలో నిబద్ధత,పారదర్శకత పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు అమలు,సమర్థంగా వినూత్న ఆలోచనలతో మండలానికి వారు విశేష సేవలు అందించినందుకు గాను 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంపీడీవో గా పి సురేంద్రనాథ్,ఉత్తమ ఇంజనీర్ మండల పంచాయతీరాజ్ ఇంజనీరు ఏ.ప్రీతి ఎంపీక కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవార్డు తీసుకున్నందుకు ఇంకా మరింత బాధ్యత పెరిగిందని మండలానికి ఇంకా మెరుగైన సేవలకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు.
