డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ , నేషనల్ ఇండిపెండెంట్ బిషప్ కౌన్సిల్ ఎన్ ఐ బి మరియు ఆంధ్రప్రదేశ్రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి దహించు అగ్ని క్యాంపస కాటవరంలో ఘనంగా జరిగినది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బిషప్ జార్జ్ శ్రీమంతుల పర్యవేక్షణలో రాష్ట్ర చైర్మన్ బిషప్ థామస్అ ధ్యక్షత
న నిర్వహించారు ముఖ్య వర్తమానికులుగా ఆర్చ్ బిషప్ మార్టిన్ కాట్రగడ్డ ఎన్ ఐ బి ఫౌండర్ అండ్ చైర్మన్ పాల్గొని సంస్థ యొక్క విశిష్టతను చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సంస్థ ఏడు దేశాలలో మరియు భారతదేశంలో 22 రాష్ట్రాలలో విస్తరించి క్రైస్తవ్యానికి సేవలు అందిస్తున్నది అని తెలియజేశారు ముఖ్యఅతిథిగా : ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొల్లవరపు జాన్ వెస్లీ హాజరై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో క్రైస్తవులకు ఆయన చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా క్రైస్తవులకు గౌరవ వేతనాన్ని అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని తెలియజేశారు. క్రైస్తవుల పవిత్ర స్థలమైన జెరుసలెం వెళ్లే యాత్రికులు అందరికీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం క్రైస్తవుల సమస్యల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల నాయకులు 300 మంది బిషప్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు నూతనంగా 30 మంది బిసఫ్ లుగా అభిషేకించ బడినారు. 26 జిల్లాల ప్రతినిధులు సెక్రటరీలు రాష్ట్ర సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్ తదితరులు బిషప్ కౌన్సిల్ అభివృద్ధి కొరకు మాట్లాడి దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయిలో పేరుగాంచినటువంటి భారత దేశంలోని 22 రాష్ట్రము లలోని పాస్టర్స్ అభ్యునతి కొరకు నిరంతరం ప్రయాస పడుచున్నా ఏకైక సంస్థ ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్అని తెలియజేశారు.ఈ సంస్థకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నందుకు వైయస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డా బొల్లవరపు జాన్ వెస్లీ కు అభినందనలు తెలిపారు. సభ్యులు అందరూ కలిసి ప్రయాణం చేయడం మేము అదృష్టంగా భావిస్తు నామని అభినందనలు ప్రోత్సాహాలు తెలియపరచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
