కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న ముత్యాలమ్మ తల్లికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి ముత్యాల గంగా రాజు వేకువ జామున అమ్మవారిని ప్రత్యేక ఆలంకరణ చేశారు. పలు గ్రామాల నుంచి భక్తు లు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వా మివారిని దర్శించుకున్నారు. కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామివారికి మొక్కులు నెరవేర్చారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, పూజారి ముత్యాల గంగరాజుస్వామి మాట్లాడుతూ.. ఆది, మంగళ, శుక్రవారాల్లో ముత్యాలమ్మవ్వ వారికి భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు.
ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
RELATED ARTICLES
