అనకాపల్లి జయ జయహే
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏపీఎస్, ఇ బి ఎస్ సి , ఎస్ టి ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ డీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ సాయి బాబా ఎం నిర్మల మూర్తి ఎన్నికల పరిశీలకులుగా హాజరై నూతన రీజనల్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఓ .శ్రీనివాసరావు, కార్యదర్శిగా ఈ చంద్రశేఖర్ యాకగ్రీవంగా ఎన్నిక కాగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వై రాజయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ బీ వరహాలు ,ట్రెజరీగా పిఎస్ఎన్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ గా సిహెచ్ లోవరాజు ,జె అశోక్ రాజీవ్, సిహెచ్ మధు ,ఎం రాజు పెంటయ్య, ఎస్ ఈశ్వరరావు అసిస్టెంట్ సెక్రటరీగా కే దేవుడు, ఎల్ రామకృష్ణ, పి చంద్ర రావు, జి ఎస్ ప్రకాష్ ,డి రామకృష్ణ తో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మరో పదిమంది ఎంపికయ్యారు గౌరవ అధ్యక్షులు డి బాపిరాజు కూడా ఎన్నిక కాబడ్డారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి నర్సీపట్నం డివిజన్ చెందిన విద్యుత్ ఉద్యోగులు అందరూ హాజరయ్యారు నూతన కమిటీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ కోసం పని చేస్తుందని వారు పేర్కొన్నారు.
