Friday, May 1, 2026
HomeNewsటిడిపి కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

టిడిపి కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

నిడదవోలు: డా॥ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నాబాబు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డా॥ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, సీనియర్ నాయకులు బైపే రాజేశ్వరరావు, ముప్పడి విజయసారథి, వరసాల రామకృష్ణ, ఎం.డి. షాజహాన్, బండి వేణుగోపాలకృష్ణ, గంగుమల్ల ప్రభావతి, శిలబోయిన వెంకటరమణ, గారపాటి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments