ప్రముఖ సేవాపరులు, వ్యాపారవేత్త గురాన సాధూరావు 10వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. చిల్ల పేట గ్రామంలో శ్రీ రామాలయ పునర్నిర్మాణం కోసం రూ. 25,000/- విరాళాన్ని సోమవారం ఆలయ కమిటీకి అందజేశారు. సాధూరావు జ్ఞాపకార్థం వారి కుటుంబం చేసిన ఈ ఆర్థిక సాయాన్ని గ్రామస్థులు, భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు
