బుచ్చయ్య పేట మండలం వడ్డాది పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. వడ్డాది లోపిఎసిఎస్ అధ్యక్షుడు దొండ నరేష్ బంగారు మెట్ల లో కోఆపరేటివ్ అధ్యక్షులు దొండ శ్రీనివాసరావు ఎల్విపి అగ్రహారంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తమరాన దాసు కోమల పూసి లో గేదెల సత్యనారాయణ. విజయ రామ రాజు పేట లో దొడ్డి కిషోర్ పార్టీ జెండాని ఎగరవేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 42 సంవత్సరాలు పూర్తయిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన. దివంగత ఎన్టీఆర్ చేసిన సేవలు తెలుగు ప్రజలు మర్చిపోలేరని వారు అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ రూపకర్త నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
