బుచ్చయ్య పేట మండలం తురకలపూడి గ్రామంలో రామాలయం నిర్మాణంలో భాగంగా కసింకోట గ్రామానికి చెందిన ఆర్ ఎ సి యస్ మేనేజింగ్ డైరెక్టర్ గరిమెళ్ళ శ్రీనివాసరావు జ్ఞాపకార్ధంగా ఆయన భార్య హైమావతి కుమారుడు సంతోష్ పవన్ రామాలయం నిర్మాణానికి గురువారం రామాలయం కమిటీ సభ్యులకు 50 వేల రూపాయలు విరాళం అందించారు. వారిని కుటుంబాన్ని గ్రామస్థులు శాలువ తో సత్కరించారు. కార్యక్రమంలో కోరుకొండ అప్పలనాయుడు, అక్కిరెడ్డి నరసింగ రావు, గంటల చిన్ననాయుడు, తదితరులు మహిళలు పాల్గొన్నారు.
