చెత్త నుండి సంపద కేంద్రాలను విధిగా ఉపయోగిస్తే అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చని జడ్పీ సీఈఓ నారాయణమూర్తి అన్నారు బుచ్చయ్యపేట మండలం
విజయరామరాజుపేటలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని మంగళవారం జడ్పీ సీఈవో నారాయణ మూర్తి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణపై సిబ్బందిని ఆరా తీశారు.గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.తడి పొడి చెత్తను వేరు చేసి, తడి చెత్త నుండి వర్మీ కంపోస్టును తయారు చేయాలన్నారు.పారిశుద్యంపై అశ్రద్ధ చేయవద్దు అన్నారు.డిప్యూటీ ఎంపీడీవో. లోవ రాజు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
