ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చి 15 న పురస్కరించుకొని
10వ తేది న అల్లూరి జిల్లా కొయ్యురు మండలం జి టి డబ్ల్యూ ఏ బాలుర పాఠశాలో ఏర్పాటు చేసిన ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నకు ముఖ్యఅతిధులుగా హాజరైన జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బూడిదే చిట్టిబాబు, మండల తహసీల్దార్ పి. మురళీబాబు, స్టేట్ ఈసీ మెంబర్ సీ హెచ్. రాజారత్నం, జిల్లా జాయింట్ సెక్రటరీ పి. భాస్కర్ రావు, పి. అప్పారావు,చందర్ రావు, కొర్ర కుమారి, వంతల కాంతమ్మ హాజరు అయ్యారు,అధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడుతూ 1962 లో వినియోగదారుల ఉద్యోమం మొదలై 1983 లో ప్రభుత్వ ఆమోదం తెలిపింది అన్నారు , వినియోగదారుల హక్కులు చట్టాలు పై విద్యార్థి దశ నుండి తెలుసుకోవాలని అన్నారు, తహసీల్దార్ మురళీబాబు మాట్లాడుతూ వినయోగదారుల వస్తూ సేవలోపాలు, వినియోగం, కల్తీ జరిగినపుడు , కన్స్యూమర్ కోర్టు లో పిర్యాదు, సేవ లోపాలు వినియోగం గురించి వివరించారు, అనంతరం మార్చి 1వ తేదీ న విజయవాడ లో జరిగిన సి ఏ పి సి ఓ ఎన్నికలలో ఎంపికైన కొయ్యురు మండలం గుడ్లపల్లి గ్రామ మహిళ శెట్టిపల్లి రాజారత్నం ( రాజకుమారి ) స్టేట్ ఈసీ నంబర్ ఎంపికైన సందర్బంగా ఆమెకు, మరియు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు చిట్టిబాబు నకు కొయ్యురు మండల తహసీల్దార్ మురళీబాబు సాలువ కప్పి సత్కరించారు, ఈ కార్యక్రమంలో వాసు,బాబురావు, బాలు, బోనింగి సోములమ్మ ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
