Home Politics Andhra Pradesh భాష్యం పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

భాష్యం పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

0

కొవ్వూరు భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. కోటేశ్వరీ దేవీ అధ్యక్షత వహించారు. విద్యా, కళలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవిని పూజిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు సంప్రదాయ పసుపు వస్త్రధారణలో పాల్గొని పండుగకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు భక్తిగీతాలు, నృత్యాలు, కవితా పఠనాలతో అలరించారు. వసంత పంచమి ప్రాముఖ్యత, భారతీయ సంస్కృతి విలువలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా సృజనాత్మకత, శీలం, శ్రద్ధలతో కూడినదిగా ఉండాలని ప్రధానోపాధ్యాయులు జి. కోటేశ్వరీ దేవీ తెలిపారు.
ఇలాంటి పండుగల ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక చైతన్యం, నైతిక విలువలు పెంపొందుతాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version