అల్లూరి జిల్లా కొయ్యురు మండలం రాజేంద్రపాలేం పీహెచ్సీ లో
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా 14ఏళ్లలోపు బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్లను వేస్తున్నామని కొయ్యూరు మండలం రాజేంద్రపాలేం పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ స్నేహలత రెడ్డి అన్నారు. సోమవారం హెచ్వీ భూలోక, పలువురు ఏఎన్ఎంలతో కలిసి పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. నేడు 11మంది బాలికలకు వ్యాక్సిన్లు వేశామన్నారు. పీహెచ్సీ పరిధిలో ఇప్పటి వరకు 18మందికి వేయడం జరిగిందని తెలిపారు.
14ఏళ్లలోపు బాలికల తల్లితండ్రులు ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
