మాడుగుల మండలం కాశిపురం వద్ద గల అక్కమ్మ పేరంటాలు గుడి వద్ద మహాశివరాత్రి పురస్కరించుకొని తీర్థ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు ఎంకోడూరు వాసవి క్లబ్ వనిత క్లబ్ ప్రతినిధులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి పసుపు కొమ్ములు సమర్పించడం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహిస్తామని సాయంత్రం ఎముకడూరు గ్రామంలో వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
