ఈనెల 15న మహాశివరాత్రి సందర్భంగా వడ్డాది వెంకటేశ్వర స్వామి 153వ వార్షిక కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి కళ్యాణరాట వేయనున్నట్లు ఈవో టిఎన్ఎస్ తెలిపారు. ఆరోజు ఉదయం 10.17 గంటలకు అర్చకుల వేదమంత్రాల నడుమ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొండా కన్నబాబుచే కల్యాణరాటను ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. నాటి నుండి ఉత్సవాలకు సంబంధించిన పనులను ప్రారంభిస్తామన్నారు. ఈనెల 27 నుండి వచ్చే నెల 4వరకు కళ్యాణోత్సవాలు జరగనున్నాయి అన్నారు.గ్రామ పెద్దలు, భక్తులు హాజరై కళ్యాణ రాష్ట్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈవో కోరారు.
