దిబ్బపాలెం గ్రామంలో శ్రీరామాలయం వద్ద భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య పల్లకి ఉత్సవం కార్యక్రమం విశాఖ స్టీల్ ప్లాంట్ 26వ పర్తి యాత్ర లో భాగంగా అతి వైభవంగా నిర్వహించబడింది. దిబ్బపాలెం గ్రామంలో స్వామి పల్లకీకు మహిళలు మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉక్కునగరం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ జి రామకృష్ణ సందేశం మరియు పర్తియాత్ర సమన్వయ కర్త మురుగానందం కెయస్ యన్ రాజు ,నారాయణ మూర్తి తమ అమూల్యమైన సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ శిరంశెట్టి బాబ్జి గుదే సుశీల గజేంద్రరావు బోండా ఈశ్వరరావు పాల్గొన్ని స్వామి వారికి హారతులు పట్టారు. భజన మండలి కన్వీనర్ శ్రీ విందుల పైడినాయుడు శ్రీ రామాలయం లో కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు అందరికీ ప్రేమ తో ప్రసాదం అందజేశారు. సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
