అల్లూరి జిల్లా కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాల లో
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సందర్భంగా కొయ్యురు సిఐ శ్రీనివాస్ కాకరపాడు కళాశాలను సంద్రశించారు.భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సజావుగా
జరిగేటట్లు తగిన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం 190 మంది, ద్వితీయ సంవత్సరం 157 మంది పరీక్షలు రాయనున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మనుడు తెలిపారు.కొయ్యురు
ఎస్ఐ కిషోర్ వర్మ మాట్లాడుతూ పరీక్ష సమయం లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
