తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని పల్ల వెంకన్న నర్సరీలో రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేపట్టారు. దేశభక్తిని ప్రతిబింబించేలా నారింజ, తెలుపు, ఆకుపచ్చ రంగుల పూలతో త్రివర్ణ థీమ్లో పుష్ప కూర్పులు రూపొందించారు. పూలతో తయారు చేసిన జాతీయ జెండా, అశోక చక్రం ఆకృతులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
నర్సరీ అంతటా రంగురంగుల పుష్పాలు, అలంకార మొక్కలతో సృజనాత్మకంగా ఏర్పాట్లు చేసి ప్రకృతి సౌందర్యానికి దేశభక్తి రంగును అద్దారు. విద్యార్థులు, రైతులు, తోటల అభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో నర్సరీని సందర్శించి ఈ పుష్పాల అలంకరణను తిలకించారు. రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను చాటే విధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కడియం ప్రాంతం తోటల రాజధానిగా ఉన్న ఖ్యాతిని మరింత పెంచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
కడియం పల్ల వెంకన్న నర్సరీలో పుష్పాల మధ్య రిపబ్లిక్ డే అలంకరణ
RELATED ARTICLES
