శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం ఎంపీడీవో సురేంద్రనాథ్ కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నారు. మండల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం తొట్టంబేడు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు ముని రాజ నాయుడు ఆధ్వర్యంలో దుశ్యాలవ కప్పి, పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.అవార్డు అందుకోవడం తోపాటు మీ బాధ్యత కూడా పెరిగిందని ఎంపీడీవో ని కొనియాడారు.శ్రీకాళహస్తి పట్టణ టిడిపి అధ్యక్షులు విజయకుమార్,తొట్టంబేడు సింగిల్ విండో చైర్మన్ బీమాల.భాస్కర్ ముదిరాజ్,తొట్టంబేడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి చిలుకూరు మనీ,చందు,టిడిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
