స్థానిక బుచ్చియ్య పేట నాలుగు రోడ్లు కూడలీ లో ధర్నా చేసి మానవహారం గా ఏర్పడి కార్యక్రమం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాలు 26000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడలో అంగన్వాడీలు పోలీసులు అక్రమ అరెస్టులను చేయడం సరికాదని హెచ్చరించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు.
