Home Politics Andhra Pradesh శివనామాస్మరణ తో భక్తులకు ప్రసాదం పంపిణీ

శివనామాస్మరణ తో భక్తులకు ప్రసాదం పంపిణీ

0

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, పుణ్యగిరి శివకోవెల నందు భక్తులకు పులిహోర ప్రసాదం, చక్కర పొంగలి, మజ్జిగ పంపిణీను శృంగవరపుకోట పుణ్యగిరి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సుమారు పదివేలమంది భక్తులకు శివనామస్మరణతో ప్రసాదాన్ని పంచిపెట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు, డిస్ట్రిక్ట్ 102 ఏరియా కోఆర్డినేటర్, మాజీ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ.ఎస్. ప్రకాశరావు మాష్టారు హాజరై భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టి ఈ సందర్బంగా మాట్లాడుతో ఎంతో చారిత్మాత్మక చరిత్ర కలిగిన పుణ్యస్థలమైన పవిత్రమైన పుణ్యగిరిలో భక్త జనులందరూ ప్రసాదాన్ని స్వీకరించి, మహాశివుని కృపకు పాత్రులు కాగలిగారని, ఎంతో పుణ్యకార్యమైన ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన పుణ్యగిరి వాకర్స్ క్లబ్ సభ్యులకు, క్లబ్ పెద్దలకు డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు, ఎ. ఎస్. ప్రకాశరావు మాష్టారు అభినందనలు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version