Home Politics Andhra Pradesh ఘనంగా మోదమ్మ ఘటాల పండుగ

ఘనంగా మోదమ్మ ఘటాల పండుగ

0

ఈ ప్రాంత ఇలవేల్పు శ్రీ మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి ఘటాలు పండగ ఆదివారం మాడుగులలో పలువురు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాడుగుల అర్బన్ కాలనీకి చెందిన గౌరీపట్నం అచ్యుతం, కోడూరు కొండలరావు జాంటీ ఫోటో స్టూడియో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పండగ నిర్వహించారు. ఈ పండుగలో ప్రత్యేక విశేషం అమ్మవారి ఘటాలకి పూర్తిగా పసుపు రంగు వేసి ముందు భాగంలో అమ్మవారి ప్రతిమ ఏర్పాటు చేసి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతో చూడముచ్చటగా కనిపించింది. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుతో పాటు పలువురు నాయకులు ఈ పండుగలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాన్ని అందజేశారు. అలాగే మరికొందరు భక్తులు కూడా అమ్మవారి పండుగను నిర్వహించుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version