ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని గురువారం చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్ ఎన్ఎస్ రాజు అమరావతి లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధి ఇంటింటికి కొళాయి పనులు కోసం వినతి పత్రం అందజేశారు. స్పందించిన డిప్యూటీ సీఎం అతి త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో చోడవరం నియోజకవర్గ కూటమి తరపున కృతజ్ఞతలు తెలియజేసారు.
