ఈస్టర్ పర్వదినం సందర్భంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ క్రిస్ట్ ఫస్ట్ చర్చ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీస్తు సమాధి నుంచి మృత్యుంజయుడై ,తిరిగి సజీవుడిగా లేచిన రోజు అని, ఈస్టర్ ఎంతో పవిత్రమైనదని అన్నారు. కార్యక్రమంలో హాజరైన క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఈస్టర్ సండే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాస్టర్ దంపతులను సన్మానించారు .కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
RELATED ARTICLES
