దక్షిణ నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం 29 వ వార్డు శ్రీ రావి దుర్గా గణపతి ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలో 77 వ ఘనతంత్ర దినోత్సవ సందర్బంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ మరియు వార్డు అధ్యక్షులు అంగటి శ్రవణ్ పాల్గొని మదర్ తెరిసా, బుద్ధుని విగ్రహాలకు పూల మాలలు వేసి అనంతరం జండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీ రావి దుర్గ గణపతి ఆటో స్టాండ్ సభ్యులు ఘనతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సేవా కార్యక్రమాలు వృద్ధులకు మరియు వికలాంగులకు చీరల పంపిణీ మరియు చిన్నారలుకు పుస్తకాలు,పెన్నులు బట్టలు పంపిణీ నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో తనని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని
ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో చిత్తూరు వెంకటేశ్వర రావు, కట్టా శ్రీనివాసరావు, సారిపిల్లి వెంకట రమణ, లక్ష్మీ నారాయణ, మురళి కృష్ణ, బొట్ట త్రినాథ్, బొట్ట వెంకన్న, సబ్బి రాజు,29వ వార్డు కూటమి శ్రేణులు ప్రజలు స్థానిక ఆటో స్టాండ్ సభ్యులు జెరాక్స్ రమణ, దుక్క ప్రసాద్, సారిపిల్లి స్వామి , మన్యాల అప్పలరాజు, సారిపిల్లి అప్పారావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మన్యాల శ్రీనివాస్
RELATED ARTICLES
