Home Politics Andhra Pradesh చోడవరంలో పలువురు జనసేనలోకి చేరిక

చోడవరంలో పలువురు జనసేనలోకి చేరిక

0

చోడవరం పట్టణంలో పలువురు బుధవారం జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకున్నారు.సీనియర్ నాయకులు సింగంపల్లి రమేష్ , చోడవరం గ్రామపంచాయతీ 9వ వార్డు మెంబర్ పొట్నూరు పెద అప్పారావు, మంగా రంగా , తమటపు సత్యనారాయణ, గాంధీ గ్రామం మహిళా నాయకురాలు కొమ్మోజు ప్రశాంతి జాయిన్ అయ్యారు.వీరందరినీ రాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ విధివిధానాలకి , పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి చోడవరం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి ప్రజలకు మరింత మెరుగైన సేవ చేయడానికి పనిచేయాలన్నారు. పార్టీలో చేరినవారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పరిపాలన విధానానికి తాము ఆకర్షతులం అయ్యి జనసేన పార్టీలో చేరామన్నారు.పార్టీని పటిష్టం చేయడానికి అలాగే తమ ప్రాంతాలకు ప్రజలకు మెరుగైన సేవలందించడానికి పనిచేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో చోడవరం పట్టణ అధ్యక్షులు కర్రి రమేష్, చోడవరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అల్లం మాధవి రామ అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు గునూరు మూలునాయుడు, చోడవరం పట్టణ వీర మహిళా అధ్యక్షురాలు నరవ సరోజిని, రాయపురాజు పేట పిఎసిఎస్ డైరక్టర్ టి మహేష్, పార్టీ సీనియర్ నాయకులు గూనురు సూర్యనారాయణ పీలా మహేష్, దాడి వెంకట అప్పారావు, ఆడారి రమణ మాలి నాయుడు, గంజి శంకర్,సియ్యాద్రి జగదీష్ ,యల్లపు ప్రశాంత్ , యల్లపు సురేష్ పుటిక రామ కృష్ణ, ముద్దుర్తిగణేష్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version