చోడవరం మండలం గౌరీపట్నం గ్రామంలో ఆదివారం
హెల్ప్ ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి గౌరి యూత్, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి బాధితులు తరలివచ్చారు. ఈ సందర్భంగా శిబిరంలో సుమారు 80 మందికి అత్యాధునిక పరికరాలతో రెటీనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అలాగే
పరీక్షలు చేయించుకున్న వారిలో తీవ్రమైన రెటీనా సమస్యలతో బాధపడుతున్న 25 మందిని శస్త్రచికిత్స కోసం నిపుణులైన వైద్యులు ఎంపిక చేశారు.
ఎంపికైన 25 మందిని తదుపరి చికిత్స నిమిత్తం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి తరలించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా సాయిలక్ష్మి నర్సింగ్ హోమ్ అర్డోపెడిక్ డాక్టర్లు డా. బండారు సత్యనారాయణ,డా. బండారు రుషికేశ్, అడ్వకేట్ కాండ్రేగుల డేవిడ్, శరగడం సిమ్మీ నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే శంకర్ ఫౌండేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని సంస్థ చోడవరం మండలం కన్వీనర్ పొలిమేర రాము తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రెటీనా వంటి క్లిష్టమైన సమస్యలను గుర్తించి, వారికి చూపు ప్రసాదించేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ అధ్యక్షులు ఆబోతు రమణ , గ్రామ సర్పంచ్ కోన లక్ష్మీ చంద్రరావు, ఎంపీటీసీ జగన్నాథరావు శంకర ఫౌండేషన్
క్యాంప్ కోఆర్డినేటర్స్ సతీష్ సిబ్బంది పాల్గొన్నారు
గౌరిపట్నం గ్రామంలో ఉచిత భారీ నేత్ర వైద్య శిబిరం
RELATED ARTICLES
