ఆకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజాంలో బుధవారం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో 100 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు.విశాఖకు చెందిన వైద్య నిపుణులు రోగులను తనిఖీ చేసి ఉచితంగా మందులు అందజేశారు.రెటీనా సమస్యతో బాధపడుతున్న 25 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేసి వారికి రవాణా సదుపాయం కల్పించి విశాఖ తరలించారు.శస్త్ర చికిత్సలు పూర్తయ్యాక వీరిని స్వగ్రామాలకు పంపించనున్నారు.క్యాంప్ కోఆర్డినేటర్ సతీష్, ఆకుల ఫౌండేషన్ కార్యదర్శి ఆకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
