అరకులోయ/హుకుంపేట: జయ జయహే.
మండలంలోని హుకుంపేట గ్రామంలో గల టీచర్స్ కాలనీలో మండల పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో మంజూరు కాగా. మంచి నీటి సదుపాయం కల్పించుట కొరకు ఆదివారం నాడు ఎంపీపీ రాజబాబు చేతులు మీదుగా కొబ్బరికాయ కొట్టి నూతన బోరు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నూతన బోరు నిర్మాణంలో హుకుంపేట పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీపీ కు సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యల పై పరిష్కారమయే చర్యలు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ పూర్ణిమ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ కొమ్మరమా. వార్డు మెంబర్ నాగబాబు. కొర్ర నాగబాబు. దలయి లక్ష్మణ్. పెసా కమిటీ సభ్యులు కాసులు. గోవింద్. మజ్జి నాగమణి. తదితరులు పాల్గొన్నారు.
