జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈనెల 21న జరగనుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. చైర్పర్సన్ డా. గుమ్మ తనూజ రాణి అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు ఎం పీ పీలు, ఎం ఎల్ ఏ లు హాజరుకావాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.
