విశాఖపట్నం, జయ జయహే మద్దిలపాలెం: కృష్ణ కాలేజ్ రోడ్డులో గల పార్టీ కార్యాలయంలో మరియు డాబాగార్డెన్స్ లో గల అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోణి శివ రామ కృష్ణ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం (రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు) ను పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ (రాజ్యసభ) సభ్యులు గొల్ల బాబు రావు, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి , బొల్లవరపు జాన్ వెస్లీ సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్ , మళ్ళ విజయ ప్రసాద్ , మొల్లి అప్పారావు ,మాజీ శాసన సభ్యులు తైనాల విజయకుమార్ , రాష్ట్ర జిల్లా , నియోజకవర్గ,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు