చోడవరం మండలం భోగాపురం గ్రామంలో సోమవారం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ పశు ఆరోగ్య శిబిరాలు ఈనెల 19వ తేది నుంచి 31వ తేదీ వరకు పలు గ్రామాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు, గొర్రెలు, మేకలకు దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.గొర్రెలు మేకలకు మసూచి వ్యాధి టీకాలు వేయడం జరిగింది. పాడిపశువులకు గర్భ కోశ వ్యాధులకు సంబంధించిన చికిత్స చేసి వాటికి తగిన మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొలిమేర బాల గంగాధర శ్రీనివాసరావు, ఎంపీటీ ఆడారి కోటి భూలోకానాయిడు ఇతర నాయకులు పాల్గొన్నారు. పశు సంవర్ధకశాఖ నుంచి ఏరియా పశువైద్యశాల చోడవరం అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు,గోవాడ పశువైద్యాధికారి డాక్టర్ కే.వాత్స్యవి సిబ్బంది పాల్గొన్నారు.
