Home Politics Andhra Pradesh దేవి షెల్టర్ ప్రారంభించిన ఆనందకుమార్

దేవి షెల్టర్ ప్రారంభించిన ఆనందకుమార్

0

మాడుగుల బస్టాండ్ లో గల శ్రీదేవి తల్లి ఆలయం వద్ద ఐదు లక్షల డైరీ నిధులతో నిర్మించిన శాశ్వత షెల్టర్ ను గురువారం డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఇక్కడ జరుగుతున్న కలశ ప్రతిష్ట మహోత్సవాలు భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందకుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఆలయ మర్యాదలతో పూర్ణకంతో వారికి స్వాగతం పలికారు. ప్రారంభోత్సవ అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆనంద్ కుమార్ ను ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డైరీ డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పి అప్పల్రాజు, టిడిపి సీనియర్ లీడర్ పైల ప్రసాదరావు,ఆలయ కమిటీ ప్రతినిధులు,ఎస్ శ్రీనివాసరావు, ఏ ఎన్ వి ప్రసాద్ ఎస్ వి కొండలరావు, నరసింహమూర్తి,ఎస్ వెంకటరాజు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హోమాన్ని తిలకించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version