Home Politics Andhra Pradesh త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు.

త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు.

0

ఎంపీడీవో జిడివి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సాయి కృష్ణ. అల్లూరి జిల్లా కొయ్యురు మండలంలో త్రాగునీటి సమస్య లేకుండా మండలంలోని అన్ని మంచినీటి బోర్లను అత్యవసరంగా బాగు చేయడానికి సిబ్బంది, సామాగ్రి అందుబాటులో ఉన్నాయని ఎంపీడీవో
జిడివి ప్రసాద్ తెలిపారు. మంగళవారం వేసవి బోరు మరమ్మత్తులు అత్యవసర కార్యక్రమం ఎంపీడీవో ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అత్యవసర త్రాగునీటి సమస్య వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో పనిచేయని బోర్లను యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేయనున్నట్లు దానికోసం సిబ్బంది సామాగ్రి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మండలంలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చేస్తామని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version