తన పెళ్లికి ఆహ్వానించిన కిడారి శ్రావణ్ కుమార్
ఏప్రిల్ 8 అమరావతి ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాడేరు లో మే 13వ తేదీన జరగనున్న తన వివాహానికి సంబంధించి తొలి శుభలేఖను మంత్రి లోకేష్ అందజేసి తన పెళ్లికి ఆహ్వానించారు.
ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన నారా లోకేష్ , కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.
