భక్తి శ్రద్ధలతో శివరాత్రి ఉత్సవాలు విజయవంతం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయo లో ఇటీవల జరిగిన మహాశివరాత్రి మహోత్సవాల్లో ఒడిస్సా, చత్తీస్గడ్, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తుల పూజలు వచ్చిన ఆదాయాలను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో లెక్కించారు, మహాశివరాత్రి ఆదా యాలు ఈ విధంగా ఉన్నాయి, శీర్షాబి అభిషేకానికి 2,92 లక్షలు, శీఘ్ర దర్శనానికి 2,17 లక్షలు, కేశఖండన టిక్కెట్లు 10 వేలు, హుండీ ఆదాయం 3,99 లక్షలు. లడ్డు ప్రసాదo 3,6 లక్షలు. పులిహోర ప్రసాదం 1.15 లక్షలు. మొత్తం ఆదాయం 13,39,352 లక్షల రూపాయలు సమకూరినట్లు ఎండల మల్లికార్జున స్వామి ఆలయ అధికారి గురునాధరావు తెలిపారు.
