ఘనంగా 16, 17వ స్నాతకోత్సవ వేడుకలు
రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం శుక్రవారం విద్యా కుసుమాలతో కళకళలాడింది. విశ్వవిద్యాలయ 16వ మరియు 17వ సంయుక్త స్నాతకోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలో ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేయడంతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది.
గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ మాన్యశ్రీ అబ్దుల్ నజీర్ గారికి వర్సిటీ అధికారులు ఘనస్వాగతం పలికారు. వేడుక ప్రారంభానికి ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
45 బంగారు పతకాలు.. 722 మందికి పట్టాలు
స్నాతకోత్సవంలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మొత్తం 45 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్.డి పట్టాలను అందజేశారు. విద్యార్థుల పరిశోధనా కృషిని, అకడమిక్ ప్రతిభను ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.
నన్నయ వర్సిటీలో స్వర్ణ పతకాల పంట
RELATED ARTICLES
