మాడుగుల ఆర్టీసీ బస్సులు సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ మంగళవారం మండల సతీష్ ఆధ్వర్యంలో స్థానికులు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. పాడేరు వెళ్ళే ప్రతిబస్సు మాడుగుల మీదుగా వెళ్ళాలనీ,ఎస్ఆర్ లో మాడుగుల స్టేజ్ రాయాలనీ,విజయనగరం,తురువోలు బస్సులు పునరుద్ధరించాలని కోరారు. అలాగే గతంలో మాదిరిగా పల్లే వెలుగు బస్సులు నిర్వహించాలని,స్థానిక బస్టాండ్ లో బస్ టైం టేబుల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా ఈ సమస్య గురించి మొరపెట్టుకుంటున్న ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సుల సమస్య పరిష్కరించండి
RELATED ARTICLES
