కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి హెచ్డీ కుమార స్వామి హామీ
విశాఖ స్టీల్ ప్లాంట్ త్వరలోనే పునరుజ్జీవనంతో అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి హెచ్డీ కుమార స్వామి హామీ ఇచ్చారు. సోమవారం భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరులతో కలసి విశాఖ స్టీల్ప్లాంట్లో పర్యటించారు. అలాగే ప్రధాన సమావేశ మందిరంలో సీఎండీ, డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో కూడిన సమగ్ర సమీక్షా సమావేశంలో పాల్గొని ప్లాంట్ పనితీరుకు కీలకమైన కార్యాచరణ పరిమితులు, సామర్థ్యం మరియు ఉప-ఉత్పత్తి పునరుద్ధరణ వ్యవస్థలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంతో పొత్తుపెట్టుకుని, ఆత్మనిర్భర్ భారత్ను ముందుకు తీసుకెళ్లడం, 2070 నాటికి నికర జీరో దిశగా పురోగమించడం, వికసిత భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. ఉన్నతాధికారులను ఉద్దేశించి తయారీ అవుట్పుట్, ప్రొడక్షన్ ఆప్టిమైజేషన్, కార్యాచరణ సామర్థ్యం, సుస్థిరత కార్యక్రమాలు మరియు ముడిసరుకు భద్రతపై దృష్టి సారించాలన్నారు. భారతదేశ ఉక్కు రంగంలో ఆరఐఎనఎల్ కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని, సామర్థ్య వినియోగాన్ని పెంపొందించడానికి, నిర్ధారిత ముడిసరుకు అనుసంధానాలను నిర్ధారించడానికి, సాంకేతిక-ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, స్థిరమైన ఉత్పత్తి కోసం ప్లాంట్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి సమయానుకూలమైన ఫలిత-ఆధారిత చర్యలను అమలు చేయాలని నిర్దేశించారు. ముందుగా కేంద్ర ఉక్కు మరియు భారీ శాఖ మంత్రివర్యులు హెచ్ డి కుమారస్వామి సిబ్బంది యొక్క గార్డ్ అఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం, ఆయన ప్లాంట్ను సమగ్రంగా సందర్శించి, కోక్ ఓవెన్ బ్యాటరీలు, బ్లాస్ట్ ఫర్నేస్ మరియు వైర్ రాడ్ మిల్ను పరిశీలించారు.
కోక్ తయారీ ప్రక్రియలో గాలి లేకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద కోకింగ్ కోల్ను కార్బనైజేషన్ చేసి మెటలర్జికల్ కోక్ తయారు చేస్తారని, ఇది బ్లాస్ట్ ఫర్నేస్ ఆపరేషన్లకు కీలకమని మంత్రి వివరించారు. ఇది నిరంతర, సమర్థవంతమైన మరియు భారీ ఉత్పత్తికి సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట సీఎండీ, డైరెక్టర్లు, ఉన్నతాధికారులు ఉన్నారు.

